బోయింగ్ అతిపెద్ద క్యాంపస్ ను ప్రారంభించిన మోదీ
ప్రపంచ విమానయాన మార్కెట్కు భారత్ నూతన శక్తిని అందించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. దేవహహల్లిలోని బోయింగ్ ఇండియా, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో విమానయానానికి డిమాండ్ పెరిగింది. దీంతో ఎయిర్లైన్లు వందల విమానాల కోసం ఆర్డర్లు చేయాల్సి వస్తోంది. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్ అవతరించింది. రాబోయే దశాబ్ద కాలంలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రపంచ విమానయాన మార్కెట్కు మన దేశం నూతన శక్తిని అందించనుంది అని అన్నారు.
Tags :