ASBL NSL Infratech

ప్రపంచంలో భారత వాణి బలం పెరిగింది: మోదీ

ప్రపంచంలో భారత వాణి బలం పెరిగింది: మోదీ

ప్రస్తుతం ప్రపంచంలో భారత గళానికి బలం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్న ఆయన ఇక్కడ జరిగిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో భారత వాణికి బలం పెరిగిందని, జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారత శక్తిని ప్రపంచ దేశాలు గుర్తించాయని చెప్పారు. అలాగే గత 30-40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయిన మహిళా బిల్లు వంటి ఎన్నో సమస్యలకు తమ ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టిందని వెల్లడించారు. ఈ ర్యాలీలో చంద్రయాన్-3 గురించి కూడా మాట్లాడిన ఆయన.. చంద్రునిపై ప్రపంచంలో ఏ దేశం కాలుమోపని ప్రాంతంలో మనం అడుగు పెట్టామని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :