ASBL NSL Infratech

ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం

ఈ నెల 28న కొత్త  పార్లమెంట్ భవనం ప్రారంభం

కొత్త పార్లమెంట్‌ భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. ఈ నెల 28వ తేదీన ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020 డిసెంబర్‌ లో సెంట్రల్‌ విస్ట్రాకు భూమి పూజా చేశారు ప్రధాని మోదీ. రెండున్నరేళ్లలోపే కొత్త పార్లమెంట్‌ నిర్మాణం ప్రారంభానికి సిద్దమైంది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయి తొమ్మిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభం కానుంది. దీంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్‌ భవనంలోనే జరుగనున్నాయి.  ఆధునిక భారతదేశ వైభవానికి చిహ్నంగా వైవిద్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీక కళల సమాహారం చేతికళలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.  ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయి తొమ్మిదేళ్లు కానున్న సందర్భంగా మోదీ పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం భారీ వేడుకను నిర్వహించనున్నారు. త్రిభుజాకారంలో ఉన్న ఈ పార్లమెంట్‌ హౌస్‌ నిర్మాణం నాలుగు అంతస్తులతో ఉంటుంది. ఇందులో 1224 మంది ఎంపీలకు సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. గతంలో కంటే భద్రతా వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్మించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :