ప్రధాని మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ అహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంపైనా చర్చించినట్లు ప్రధాని తెలిపారు. జూన్ 4న వెల్లడికాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోదీ గెలుపుపై విదేశాలూ నమ్మకంతో ఉన్నాయన్న విషయాన్ని తాజా ఆహ్వానం చాటుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Tags :