ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

22న అయోధ్యలోనే కాదు.. ఒడిశాలోనూ

22న అయోధ్యలోనే కాదు.. ఒడిశాలోనూ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఒడిశాలో నిర్మించిన రామ మందిరాన్ని కూడా అదే రోజున ప్రారంభిస్తున్నారు. నయాగఢ్‌ జిల్లాలోని ఫతేగఢ్‌ గ్రామంలో ఈ రామాలయాన్ని నిర్మించారు. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై బౌలమాల రాయితో ఆలయం నిర్మాణం చేపట్టారు. 2017లో ఈ గుడి నిర్మాణం ప్రారంభమైంది. సుమారు 150 మందికి పైగా కార్మికులు ఏడేళ్లు శ్రమించారు. 165 అడుగుల పొడవైన రామ మందిరాన్ని నిర్మించారు. చుట్టూ పచ్చదనంతో కూడిన రామాలయం ఎంతో ఆకట్టుకుంటున్నది.

ఈ నెల 22న ఒడిశాలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా క్రతువులు ఒక రోజు ముందుగానే మొదలుకానున్నాయి. ఆలయ ప్రారంభ మహోత్సవానికి హాజరు కావాలని పూరీ శంకరాచార్య, మహారాజులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంతో పాటు వివిధ ఆలయాల పూజారులు, అధికారులు, పలువురు ప్రముఖులను కూడా రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :