తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. ముఖ్యనేతల నామినేషన్లు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోలాహలం నెలకొంది. తెలంగాణలో పలువురు లోక్సభ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చేవెళ్ల స్థానం నుంచి రంజిత్ రెడ్డి ( కాంగ్రెస్), కాసాని జ్ఞానేశ్వర్ ( బీఆర్ఎస్) నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, నాగర్కర్నూల్ నుంచి మల్లు రవి (కాంగ్రెస్) నామ పత్రాలను సమర్పించారు. ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నేత రఘురాం రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందించారు.
ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, గుడివాడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం అభ్యర్థిగా సత్యకుమార్ ( బీజేపీ), చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు( టీడీపీ), నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ( వైసీపీ) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.