లోకల్ ట్రైన్ లో కేంద్ర మంత్రి నిర్మలమ్మ
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ఆమె ఘట్కోపర్ నుంచి కళ్యాణ్ వరకు ట్రైన్లో ప్రయాణిస్తూ, అందరితో ముచ్చటించినట్లు ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అందులో ఆమె యువతతో ఉత్సాహంగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రైల్వే సదుపాయాలు, సేవల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. రైళ్లలో రద్దీ, మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకోవాలని వారు ఆమెను కోరారు. నిర్మలమ్మ ఈ విధంగా రైల్లో ప్రయాణించి, ప్రజలతో మాట్లాడడంతో పలువురు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Tags :