మరో పీరియాడికల్ మూవీలో నిఖిల్
కార్తికేయ2 సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుని నార్త్లో ఏకంగా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక చిన్న మూవీకి ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం అంటే మామూలు విషయం కాదు.
ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో నిఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ని కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీలతోనే చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా స్పై అనే టైటిల్తో ఓ సినిమాను నిఖిల్ కంప్లీట్ చేశాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నిఖిల్ రా ఏజెంట్గా కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఠాగూర్ మధు నిర్మాణంలో నిఖిల్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్దడానికి ఠాగూర్ మధు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా పాన్ ఇండియన్ మూవీ అంటే పీరియాడిక్ జోనర్లోనే ఎక్కువ స్టోరీలొస్తున్నాయి.
ఇప్పుడు నిఖిల్ తో ఠాగూర్ మధు రూపొందించనున్న ఈ సినిమా కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఫిక్షనల్ స్టోరీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కూడా హిట్ అయితే నిఖిల్ టాప్ స్టార్ల జాబితాలోకి వెళ్లడం ఖాయంగా అనిపిస్తోంది.