రూ.8 వేల కోట్లు ఇస్తే .. విడిపోయేందుకు సిద్ధం : నవాజ్ మోదీ
రేమండ్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సింఘానియా నికర ఆస్తిలో 75 శాతం (రూ.8200 కోట్లు) తనకు ఇస్తేనే విడిపోయేందుకు అంగీకరిస్తానని నవాజ్ మోదీ తెలిపినట్లు సమాచారం. తనకు నిహారిక, నిసా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం ఆ డబ్బు అవసరం అవుతుందని నవాజ్ మోదీ చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె డిమాండ్కు గౌతమ్ సింఘానియా దాదాపు అంగీకరించినట్లు సమాచారం.
Tags :