రాజకీయాలలో కూడా డీప్ ఫేక్.. కలకలం సృష్టిస్తున్న భువనేశ్వరి ఆడియో..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల లో సోషల్ మీడియా హై టెన్షన్స్ సృష్టిస్తోంది. రీసెంట్ గా జగన్ ఆర్ఎస్ఎస్ నేతను కలిసినట్టు పాత ఫోటోని కొత్తదిగా చూపించి ఫేక్ న్యూస్ సృష్టించారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి.. దివంగత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన భువనేశ్వరి పై ఓ ఫేక్ ఆడియో వైరల్ అవుతుంది. కులం పేరుతో మరో వ్యక్తిని ఆమె దూషిస్తున్నట్లుగా.. అసభ్యకరమైన పదజాలం వాడినట్టుగా ఓ వాయిస్ ని సృష్టించి కొంతమంది సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ.. ఆ వాయిస్ భువనేశ్వర్ది కాదు అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దీనిపై వైసీపీ నుంచి ఎటువంటి విమర్శ రాలేదు.. అయినా సరే టీడీపీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కావాలనే వైసీపీ ఇలాంటివి సృష్టిస్తోంది అంటూ ఆరోపించింది. సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయితనంగా చేసిన వాటికి ఇలా అధికారికంగా స్పందించడమే కాకుండా పక్కవారిని నిందించడం వారి విజ్ఞతకు సూచనగా అందరూ భావిస్తున్నారు.