ASBL NSL Infratech

మరోసారి అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

మరోసారి అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మళ్లీ భారతీయ అపర కుబేరుడిగా అవతరించారు. తాజాగా విడుదలైన 360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023 ప్రకారం ముకేశ్‌ సంపద రూ.8.08 లక్షల కోట్లుగా ఉన్నది. ఇదే సమయంలో గౌతమ్‌ అదానీ ఆస్తులు రూ.4.47 లక్షల కోట్లుగానే ఉన్నట్టు తేలింది. దీంతో మరోసారి దేశీయ ధనికుల్లో అగ్రస్థానం ముకేశ్‌కే దక్కింది. క్రిందటిసారి గౌతమ్‌ అదానీ టాప్‌లో ఉండగా, గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద ఏకంగా 57 శాతం కరిగిపోయినట్లు హురున్‌ పేర్కొన్నది. ఫలితంగానే ముకేశ్‌ అంబానీ మళ్లీ టాప్‌లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. నిజానికి ఈ ఏడాది కాలంలో ముకేశ్‌ సంపద పెరిగింది కేవలం 2 శాతమే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :