రామ్ చరణ్కు జోడీగా సీతారామం బ్యూటీ
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరో అయ్యాడు రామ్ చరణ్. దీని తర్వాత వెంటనే సినిమాను రిలీజ్ చేయాలని తమిళ డైరెక్టర్ శంకర్తో సినిమాను లైన్లో అయితే పెట్టగలిగాడు కానీ కొన్ని కారణాల వల్ల చరణ్ ప్లాన్ అనుకున్నట్లుగా వర్కవుట్ కాలేదు. అనుకోకుండా శంకర్ ఇండియన్-2 సినిమా కూడా తీయాల్సి వచ్చింది. శంకర్కు ఉన్న కమిట్మెంట్ వల్ల చరణ్ 15వ సినిమా లేటవుతూ వస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో చేస్తూనే చరణ్, కెరీర్ స్టార్టింగ్లోనే ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ను తెరకెక్కించిన బుచ్చి బాబు సాన తో ఓ సినిమాకు కమిటెంట్ ఇచ్చాడు. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చరణ్- బుచ్చి బాబు సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిందని, దాదాపు ఆ హీరోయిన్తోనే సెట్స్పైకి వెళ్లనున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సీతారామం సినిమాతో సీతగా ప్రేక్షకుల మనసు దోచిన మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో రామ్ చరణ్తో జోడీ కట్టనుంది. సీతారామం తర్వాత తెలుగు నుంచి చాలా మంది మృణాళ్ను సంప్రదించినా, సినిమాల ఎంపికలో మృణాళ్ తొందరపడకుండా నాని సినిమా మాత్రమే ఓకే చేసింది. ఆ తర్వాత ఈ భామ ఒప్పుకొన్న ఒకే ఒక సినిమా చరణ్- బుచ్చి బాబు సినిమా మాత్రమే.
ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్కు ఎనలేని క్రేజ్ వచ్చిన తర్వాత చరణ్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే తెరకెక్కనున్నాయి. ఇలాంటి పెద్ద సినిమాలో నటిస్తే మృణాళ్ కెరీర్కు చాలా ప్లస్ అవుతుందని, మృణాళ్ వెంటనే ఈ చిత్రాన్ని ఓకే చేసినట్లు సమాచారం. చరణ్- మృణాళ్ జంట చాలా బాగుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు అనే కొత్త నిర్మాత నిర్మించనున్నారు.