ASBL NSL Infratech

రామగుండం సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

రామగుండం సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ఉజల్వ భారత్‌ ఉజ్వల భవిష్యత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో విద్యుత్‌ వినియోగదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌ వేదికగా ప్రసంగించారు. రామగుండం 100 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుతో పాటు కేరళలోని 92 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును జాతికి అంకింతం చేశారు. అదేవిధంగా రాజస్థాన్‌లో  735 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు. గుజరాత్‌లోని హైడ్రోజన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :