ఏప్రిల్ 13, 14 తేదీల్లో మాటా కన్వెన్షన్
మన అమెరికా తెలుగు సంఘం మహాసభలు ఏప్రిల్ 13,14 తేదీల్లో న్యూజెర్సిలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు పలువురు గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, ఇతర సినీ కళాకారులు హాజరవుతున్నారు. సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, గాయనీ గాయకులు కార్తీక్, సమీర భరద్వాజ్, కౌసల్య, సాయి చరణ్, సౌజన్య తదితరులు ఈ మహాసభల్లో పాటలను పాడనున్నారు. సాహిత్య వింజమూరి, మఖ్దూం యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మహాసభలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఫౌండర్, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనగోని తెలిపారు. కన్వీనర్గా స్వాతి అట్లూరి వ్యవహరిస్తున్నారు. కన్వెన్షన్ కమిటీ సభ్యులుగా ప్రవీణ్ గూడురు, కిరణ్ దుద్దగి, కో ఆర్డినేటర్గా వెంకట్ సుంకిరెడ్డి ఉన్నారు.
Tags :