ASBL NSL Infratech

ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు.. కేసీఆర్ కుటుంబానికి

ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు.. కేసీఆర్ కుటుంబానికి

ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు, కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రాజగోపాల్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలన్నారు. కేసీఆర్‌ భావిస్తే ఉప ఎన్నిక రాదు. ప్రజలు సిద్ధంగా ఉంటే మునుగోడు ఉప ఎన్నికల వస్తుందన్నారు. అభివృద్ధి కేవలం, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కే పరిమితం చేశారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందన్నారు. మునుగోడు, రాష్ట్ర ప్రజల్లో చర్చ జరగాలి. 10`15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తామన్నారు. అమిత్‌ షాతో నా రాజీనామా గురించి మాట్లాడలేదు అని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :