అయోధ్యకు కానుకగా ఓనవిల్లు
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం నుంచి సంప్రదాయ ఆచారంలో భాగమైన ఓనవిల్లు పంపనున్నారు. విల్లు ఆకారం లోని ఈ చెక్క పలకకు రెండు వైపులా దశావతారాలు, శ్రీరామ పట్టాభిషేకం వంటి బొమ్మలు చిత్రిస్తారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు ఈ ఓనవిల్లును అందజేయనున్నట్లు ఆలయ పాలక వర్గం తెలిపింది. కొచిన్ నుంచి విమానంలో దీన్ని అయోధ్యకు తరలిస్తారు. గత మూడు శతాబ్దాలుగా శ్రీ పద్మనాభస్వామికి ఏటా ఈ సంప్రదాయ ఓనవిల్లును సమర్పించడం ఆచారంగా వస్తోంది.
Tags :