రాజీనామా పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కలిశారు. కాంగ్రెస్కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్బంగా వీహెచ్కు తెలిపారు. అనంతరం జగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని వీడనని స్పష్టం చేశారు. రాజీనామా చేయొద్దని పార్టీ అధిష్టానం కోరిందని తెలిపారు. మరోవైపు పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సోనియాగాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తన మీద సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు దీనిపై పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనంతరం వీహెచ్ మాట్లాడుతూ సామాజిక మాద్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్పింగ్ చేశారని తెలిపారు. టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని మతిమిలాడం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.