భారత్ లో ఇన్నోవా సొల్యుషన్స్ కేంద్రం
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ గ్లోబల్ సొల్యూషన్స్, మన దేశంలో కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. వచ్చే ఏడాది ఇక్కడ మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగాధిపతి ప్రదీప్ యాడ్లపాటి తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక సేవలు, కమ్యూనికేషన్స్, మీడియా తదితర రంగాల్లోని సంస్థలకు సాంకేతిక సేవలను తాము అందిస్తున్నట్లు వెల్లడిరచారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ సాంకేతికంగా కీలకంగా మారుతోందన్నారు. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 55,000 మంది ఉద్యోగులున్నారు. ఇందులో భారత్ ఉద్యోగుల సంఖ్య 10 వేల వరకు ఉంటుంది.
Tags :