వరల్డ్ కప్ ఫైనల్ కు ముఖ్య అతిథిగా.. మోదీ
ఆహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఆ మ్యాచ్కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఆ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారట. ఆ మ్యాచ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని చెబుతున్నారు. మోదీతో పాటు క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా మ్యాచ్కు హాజరవుతారని తెలుస్తోంది.
Tags :