ఆస్ట్రాలజీ కంపెనీ సీఈవో బంపరాఫర్ ... భారత్ గెలిస్తే 100 కోట్లు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచకప్ 2023 పైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భారత్ గెలుపు కోసం పూజలు, యాగాలు కూడా జరిపిస్తున్నారు. తాజాగా ఓ ఆస్ట్రాలజీ కంపెనీ సీఈవో పునీత్ గుప్తా భారత్ గెలవాలని కోరుకుంటూ తమ కస్టమర్లకు ఓ బంపరాఫర్ ప్రకటించారు. ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని తెలిపారు. ఈ ఆఫర్ను తన సోషల్మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. టీమ్ఇండియా గెలవాలని కోరుకుందాం. ప్రార్థిద్ధాం అని అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్కు తరలివస్తున్నారు.
Tags :