ASBL NSL Infratech

వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది.. ఈటల సంచలన ఆరోపణలు

వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది.. ఈటల సంచలన ఆరోపణలు

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు చావుతప్పి కన్నులొట్టపోయినట్టుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ కంచుకోటలో బీజేపీ సత్తా చాటింది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కాకముందే మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో మోహరించారు. ఓటమి భయంతోనే మాపై దాడులకు పాల్పడ్డారు. హుజురాబాద్‌లోనూ నన్ను ఓడించేందుకు అనేక కుట్రలు చేశారు. ఎనిమిదేళ్లుగా సీపీఎం, సీపీఐ నేతలకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇప్పుడు ఓటమి భయంతోనే కమ్యూనిస్టులను మచ్చిక చేసుకున్నారు.

కేసీఆర్‌ తీరు అందితే జుట్టు లేదంటే కాళ్లు అనే చందంగా ఉంటుంది. వామపక్షాల భిక్షతో టీఆర్‌ఎస్‌ గెలిచింది. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారు. అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి వాళ్లు కృషి చేశారు. ఇంత చేసినా స్వల్ప మెజారీటీనే వచ్చింది అని ఎద్దేవా చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :