అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఈసీ వెబ్ సైట్..
లోక్ సభ ఎన్నికలు జరగబోయే నేపథ్యంలో జోరుగా సాగుతున్న అసత్య ప్రచారాన్ని అరికట్టడం కోసం ఎన్నికల కమిషన్ సరికొత్త వెబ్సైట్ను ప్రజల కోసం తీసుకువచ్చింది. మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఈ వెబ్సైట్ను మంగళవారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకుమార్, జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ ఆధ్వర్యంలో లాంచ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో సాగుతున్న అసత్య ప్రచార వ్యాప్తిని అరికట్టడం కోసం.. ప్రజలకు ఖచ్చితమైనటువంటి సమాచారం అందించడం కోసం ఈ కొత్త వెబ్సైట్ ఉపయోగపడుతుంది అని ఈసీ వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా వ్యాపిస్తున్న అసత్య సమాచారాల గురించి.. ప్రజలు అడిగే ప్రశ్నల గురించి.. ఓటర్లకు తెలియజేసే విధంగా ఈ వెబ్సైట్ పనితీరు ఉంటుంది అని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ చర్య ద్వారా ప్రజలకు నిజాలు తెలుస్తాయి అని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.
https://mythvsreality.eci.gov.in/