ASBL NSL Infratech

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. రాజస్థాన్ లో

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. రాజస్థాన్ లో

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీలో మార్పు చేసింది. నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ తేదీని నవంబర్‌ 25కి మారుస్తూ  ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌లో నవంబర్‌ 23న దేవ్‌ ఉథాని ఏకాదశి. దాంతో ఆ రాష్ట్రంలో 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌ తేదీని మార్చాలంటూ పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి ఈసీకి విజ్ఞప్తులు వచ్చాయి.   పోలింగ్‌ తేదీ మార్చాలంటూ మీడియా సంస్థల వేదికగా వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్‌ 25కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :