కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. రాజస్థాన్ లో
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు చేసింది. నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్ తేదీని నవంబర్ 25కి మారుస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్లో నవంబర్ 23న దేవ్ ఉథాని ఏకాదశి. దాంతో ఆ రాష్ట్రంలో 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలింగ్ తేదీని మార్చాలంటూ పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి ఈసీకి విజ్ఞప్తులు వచ్చాయి. పోలింగ్ తేదీ మార్చాలంటూ మీడియా సంస్థల వేదికగా వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను నవంబర్ 25కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది.
Tags :