భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం
భారత్కు చెందిన ఎంపిక చేసిన పాస్పోర్టు హోల్డర్లకు దుబాయ్లోని ఎమిరేట్స్ ఎయిర్లైన్ సంస్థ ప్రీ అప్రూవ్డ్ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని ప్రారంభించింది. తమ ఎయిర్లైన్స్లో విమాన ప్రయాణం కోసం బుక్ చేసుకున్నవారికి ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. ప్రయాణికులు ఆరు నెలల యూఎస్ వీసా, యూఎస్ గ్రీన్కార్డు, యురోపియన్ యూనియన్ లేదా యూకే రెసిడెన్సీనీ తప్పనిసరిగా కలిగి ఉండాలి. దుబాయ్ వీసా ప్రాసెసింగ్ సెంటర్ జారీ చేసే 14 రోజల సింగిల్ ఎంట్రీ వీసా, భారతీయులు దుబాయ్ చేరుకున్న తర్వాత వారి ప్రవేశ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్లైన్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చిన్, కోల్కతా, ముంబయి, తిరువనంతపురంలకు రవానా సేవలందిస్తోంది.
Tags :