తనతో చర్చకు రావాలి... బైడెన్ కు ట్రంప్ సవాల్
అమెరికా అధ్యక్ష పీఠం కోసం మరోసారి డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ పోటీ పడడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో తనతో చర్చకు రావాలని బైడెన్కు ట్రంప్ సవాల్ విసిరారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను ప్రజల ముందుంచడం అవసరమని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రయోజనాలు, దేశ ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని కీలక అంశాలపై నేను, జో బైడెన్ చర్చించడం చాలా అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు. తాను ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బైడెన్కు సవాల్ విసిరారు.
Tags :