ASBL NSL Infratech

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరపు న్యాయవాదులు రిజాయిండర్‌ దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత తరపున మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఫ్వీు కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్‌ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారు. అఫ్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారు. ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదు.  సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్‌ అడిగారు. కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి అని ఈడీ తెలిపింది. వాదనల అనంతరం రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఏప్రిల్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :