ఆ పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిచినా.. మంత్రి పదవికి రాజీనామా
కాంగ్రెస్పై విమర్శలు చేసే కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనూ గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. నల్గొండలో బీజేపీ, బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి, జిల్లాకి ఏమీ చేయని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ఉండదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే జిల్లాలో అభివృద్ధి జరగలేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.