హైదరాబాద్ కు మరో ప్రతిష్టాత్మక సంస్థ
హైదరాబాద్ నగరంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల నగరానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. భూమి గుర్తింపునకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, గ్లోబల్ సెంటర్ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 50 ఎకరాల భూమిని గుర్తించి కేంద్రానికి లేఖ అందించాలని కోరారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రేడిషనల్ మెడిసిన్ నెలకొల్పేందుకు డబ్ల్యూహెచ్వో ముందుకొచ్చిందని, పీఎంలో నుంచి కూడా ఇటీవల అధికారిక ప్రతిపాదన రావడంతో ఇందుకు అవసరమైన 40 నుంచి 50 ఎకరాల భూమిని సేకరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
Tags :