బయో ఆసియా సదస్సుకు బిల్గేట్స్
హైదరాబాద్లో ఈ నెల 24న ప్రారంభం కానున్న రెండ్రోజుల బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వార్షిక సదస్సు ‘బయో ఆసియా’లో బిల్ మెలిండా గేట్స్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్స్ కు, మెడ్ ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. బిల్ గేట్స్, అలెక్స్ గోర్స్ కు, జెఫ్మార్తా.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తదితరులతో సాగే ఇష్టాగోష్టిలో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లుగా నేర్చుకున్న పాఠాలు, ఆధునిక ఆరోగ్య రక్షణ విధానాలు, విశ్వవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు, 72 దేశాలకు చెందిన 31 వేల మంది ప్రతినిధులు వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొంటున్నారని బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు.