ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసేది.. అధిష్టానం నిర్ణయిస్తుంది
ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 15 సీట్లే గెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై జాతీయ నాయకత్వం నిర్ణయం ప్రకారం నడుచుకోనున్నట్లు స్పష్టం చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. తెలంగాణపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కు సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందని తెలిపారు.
Tags :