ట్రిపుల్ యాక్షన్లో బాలయ్య
నటసింహ బాలయ్య- బోయపాటి కాంబో అంటే కచ్చితంగా బాలయ్య డ్యూయల్ రోల్ పోషించాల్సిందే. ఇది వాళ్లిద్దరూ తీసుకున్న డెసిషన్. సింహా, లెజెండ్, అఖండ వరకూ ప్రతీ సినిమాలో బాలయ్య డబుల్ యాక్షన్తోనే బాక్సాఫీస్ని షేక్ చేశారు. వీటికి ముందు బాలయ్య చాలా సినిమాల్లో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని ఎన్నోసార్లు అలరించారు.
ఇకపోతే ఇప్పుడు బాలయ్య108లో అంతకు మించి బాలయ్యని హైలైట్ చేస్తున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అనిల్ తన మార్క్ ఎంటర్టైనింగ్ మిస్ అవకుండా, బాలయ్య టైప్ యాక్షన్ లెవల్స్ ఏ మాత్రం తగ్గకుండా స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అలా రెడీ చేసిన స్టోరీ నుంచే మూడు పాత్రలు బాలయ్య వేస్తే బాగుంటుందని భావించి ఆ బాధ్యతలు ఆయనకే అప్పగించారట. రెండు పాత్రలు సీరియస్గా ఉంటే, ఇంకో క్యారెక్టర్ మాత్రం పూర్తిగా ఇన్నోసెంట్గా, హాస్యాస్పదంగా డిజైన్ చేశారట. రెండు క్యారెక్టర్లు కామన్గా ఉన్నా, ఇంకో క్యారెక్టర్లో మాత్రం టోటల్ సరికొత్త బాలయ్యని చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇలాంటి క్యారెక్టర్లో బాలయ్యని మునుపెన్నడూ చూసి ఉండరని, అంత ట్రెండీ లుక్లో బాలయ్య తెరపైకి కనిపిస్తారని సన్నిహిత వర్గాల సమాచారం. ఆ క్యారెక్టర్ గురించి అనిల్ బాలయ్యకు చెప్పగానే చాలా థ్రిల్లయ్యాడట బాలయ్య. ఆ క్యారెక్టర్కి అనిల్ తనదైన టైమింగ్, డైలాగ్స్, సీన్స్ రాసినట్లు తెలుస్తోంది. మరి ఈ ట్రిపుల్ యాక్షన్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బాలయ్యతో పాటు ఇతర తారాగణంపై షూటింగ్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య నుంచి వీరసింహా రెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న తెలిసిందే. జనవరి 12న భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. ఈ సినిమాకు పోటీగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కానుంది.