కేంద్రమంత్రి సింధియా సంచలన ఆరోపణలు... తెలంగాణలో
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని ఆరోపించారు. తప్పు చేయనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అంటే భయమెందుకు? అని ప్రశ్నించారు.
Tags :