తెలంగాణ కొత్త సీఎస్గా సోమేశ్ కుమార్
తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ను నియమించింది. సీఎస్ ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు చేసి తెలంగాణ రాష్ట్ర ఐదో ప్రభుత్వ కార్యదర్శిని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సోమేశ్ కుమార్ పదవీకాలం 2023 డిసెంబర్ 31 వరకు ఉంది. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్ ను నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Tags :