రూ.2వేల నోట్లను రద్దు చేయం
పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రవేశ పెట్టిన రెండువేల రూపాయల నోట్లను ఉపసంహరించకునే ప్రతిపాదనేదీ లేనేలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సృష్టం చేశారు. ఈ మేరకు లోక్సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. గత డిసెంబరు 10 తేదీ నాటికి భారత రిజర్వు బ్యాంకుకు సుమారు రూ.12.44 లక్షల కోట్ల మేరకు రద్దయిపోయిన వెయ్యి, అయిదువందల రూపాలయ నోట్లు వచ్చి చేరాయన్నారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీ నాటి దేశంలో చెలామణిలో ఉన్న డబ్బు మొత్తం రూ.12 లక్షల కోట్లని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మక పరిశీలనలు నిర్వహించే నిమిత్తం రూ.10 ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు ఆర్బీఐకి అనుమతినిచ్చినట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్మేఘవాల్ లోక్సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. దేశంలోని అయిదు ప్రాంతాల్లో ముందుగా ఈ ప్లాస్టిక్ పదిరూపాయల నోట్లతో ప్రాథమికంగా ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించనున్నట్లు వివరించారు.