14న కాదు... 15న : శబరిమల
రెండు రోజుల క్రితం మండల పూజలు ముగిసిన అనంతరం మూసుకున్న కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు మకర విళక్కు కోసం తెరచుకున్నాయి. సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి గర్భాలయాన్ని అధికారులు తెరిచారు. ఈ సారి జనవరి 15న మకర సంక్రమణం జరగనున్నందున, ఆ రోజే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని ప్రకటిస్తూ, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ పూజారులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరింది. ఆపై ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20 వరకు కొనసాగుతాయని సృష్టం చేశారు. 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు.
Tags :