రైతుల దీక్షకు పవన్ కల్యాణ్ మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు 14వ రోజు కొనసాగుతున్నాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలో పర్యటించారు. తొలుత మంగళగిరి మండలం నవులూరులో రైతుల దీక్షకు పవన్ సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులకు అభివాదం చేస్తూ ఎర్రబాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు తమ సమస్యలపై పవన్కు వివరించారు. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్తో పాటు పలువురు పార్టీ నేతలు పవన్ పర్యటనలో పాల్గొన్నారు.
Tags :