ASBL NSL Infratech

దీక్ష విరమించిన దేవినేని

దీక్ష విరమించిన దేవినేని

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో చేపట్టిన 24 గంటల దీక్షను విరమించారు. పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాజధాని అమరావతిపై ప్రభుత్వం సృష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి భూములిచ్చారని గుర్తు చేశారు. రాజధాని కోసం రెండు, మూడు పంటలు పండే భూములను త్యాగం చేసిన రైతులను అవమానపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :