దీక్ష విరమించిన దేవినేని
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో చేపట్టిన 24 గంటల దీక్షను విరమించారు. పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాజధాని అమరావతిపై ప్రభుత్వం సృష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి భూములిచ్చారని గుర్తు చేశారు. రాజధాని కోసం రెండు, మూడు పంటలు పండే భూములను త్యాగం చేసిన రైతులను అవమానపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు.
Tags :