ఈ చిత్రం దిశకు అంకితం
నేని శేఖర్ హీరోగా నటిస్తూ, తెరకెక్కిస్తున్న చిత్రం అమ్మాయంటే అలుసా?. కార్తీక్ రెడ్డి, స్వాతి, శ్వేత, ఆర్తి ప్రధాన పాత్రధారులు. యలమంచిలి బ్రహ్మశేఖర్, నవులూరి మాధవరెడ్డి, సరిపూడి హరికృష్ణ నిర్మాతలు. నవులూరి భాస్కర్రెడ్డి సమర్పిస్తున్నారు. వినీష్ స్వరకర్త. హైదరాబాద్లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యండి ఖాసిమ్, సురేష్ కొండేటి, జి.వి.చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేని శేఖర్ మాట్లాడుతూ అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆలోచన రేకెత్తించేలా కథ, కథనాలుంటాయి. ఈ చిత్రాన్ని దిశకి అంకితం ఇవ్వబోతున్నాం. వినీష్ సంగీతం చిత్రానికి ప్రధానబలం అన్నారు. సమాజానికి ఎలాంటి సినిమా అవసరమో, శేఖర్ అలాంటి కథనే తెరకెక్కించాడని అతిథులు అభిప్రాయపడ్డారు.
Tags :