తానా శతకపద్యార్చనను ప్రారంభించిన జే తాళ్ళూరి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో జనవరి 6 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ''అమ్మ నాన్న గురువు-శతక పద్యార్చన'' కార్యక్రమాన్ని న్యూయార్క్ నగరంలో తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థుల చేత పద్యాలను ఆయన చెప్పించడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తానాలాంటి సంస్థ విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Tags :