తేజు.. స్పీడ్ పెంచాలిక
గతేడాది విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి తేజ్ తర్వాతి సినిమాకు సంబంధించి ఎలాంటి ఊసూ వినిపించడం లేదు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ ఆ సినిమా ఆగిపోయిందంటున్నారు. క్లారిటీ ఇవ్వమంటే నాకంటే మీకే ఎక్కువ తెలుసని మీడియాతో చెప్పి తప్పించుకున్నాడు సాయి తేజ్.
మంచి ఉద్దేశంతో తీసిన సత్య షార్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ లో తప్ప తేజ్ ఇంకెక్కడా కనిపించట్లేదు. మధ్యలో కార్తీక్ దండుతో సీక్వెల్ చేస్తానని ఆ టైమ్ లో అన్నాడు. కొన్నాళ్ల తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఓ మిస్టిక్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేస్తూ ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో హీరో సాయి తేజ్ అనే అందరూ అనుకున్నారు. కానీ అందులో నాగచైతన్య ఓకే అయ్యాడని సమాచారం.
ముందుగా కార్తీక్ ఆ కథను సాయి తేజ్ ను దృష్టిలో ఉంచుకునే రాశాడని, కానీ కొన్ని కారణాల వల్ల అది చైతూ దగ్గరకు వెళ్లిందని టాక్. వీటిలో నిజమెంతన్నది పక్కన పెడితే సాయి తేజ్ వీలైనంత త్వరగా కొత్త సినిమా స్టార్ట్ చేయాలి. కాంపిటిషన్ ఎక్కువ ఉన్న ఇలాంటి టైమ్ లో ఇంత ఎక్కువ గ్యాప్ తీసుకోవడం తన కెరీర్ కే నష్టం. ఓ వైపు వరుణ్ తేజ్, వైష్ణవ్ వరుస ఫ్లాపులతో మార్కెట్ ను రిస్క్ లో పడేసుకున్నారు.