సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్న బాలీవుడ్
నితీష్ తివారీ నటిస్తున్నదర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణం నుంచి రీసెంట్ గా పిక్స్ లీకైన నుంచి సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నాయి కొన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు. సీత లుక్స్ బాలేవని కొంత మంది అంటుంటే, మరికొంత మంది గతంలో ఆమె కాశ్మీర్ ఫైల్స్ గురించి అన్న మాటలను వక్రీకరించి కట్ చేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారు.
ఇదంతా ఓ సౌత్ హీరోయిన్ ఇంత గొప్ప పాత్ర దక్కించుకుందనే కారణంతో చేస్తున్నదే తప్పించి మరోటి కాదని సాయి పల్లవి ఫ్యాన్స్ అంటున్నారు. నిజంగా సాయి పల్లవిని కామెంట్ చేయాలనుకుంటే అంతకంటే ఎక్కువ ట్రోలింగ్ రణ్బీర్ ను కూడా చేయాలి. ఎందుకంటే లుక్స్ పరంగా రణ్బీర్ రాముడిగా సెట్ కాలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
ఏదైనా సరే ఇలాంటి లీక్డ్ ఫోటోలను ఆధారంగా చేసుకుని ఇలాంటి ట్రోల్స్ చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఎవరెన్ని చెప్పినా సీతగా సాయి పల్లవి నటన మీద ఎవరూ డౌట్ పడనక్కర్లేదు. అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూలో నటిస్తున్న సాయి పల్లవి మొత్తం రెండు బాలీవుడ్ సినిమాలతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇది కాకుండా టాలీవుడ్ లో నాగచైతన్యతో తండేల్, తమిళంలో శివకార్తికేయన్ తో అమరన్ సినిమాల్లో నటిస్తుంది. కాగా రామాయణం సినిమా కోసం సాయి పల్లవి రూ.30 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.