ASBL NSL Infratech

పాకిస్థాన్ యువతికి భారత్ గుండె

పాకిస్థాన్ యువతికి భారత్ గుండె

హార్ట్‌ ఫెయిల్యూర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ఒక యువతికి భారత్‌కు చెందిన ఒక డోనర్‌ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన్‌కు చెన్నై లోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ వైద్యులు గుండెను మార్చి పునర్జన్మనిచ్చారు. ఆపరేషన్‌కు రూ.35 లక్షలు అయ్యిందని, అయితే ఆ మొత్తాన్ని ఎంజీఎం హాస్పిటల్‌, మెడికల్‌ ట్రస్ట్‌ వారే భరించారని, వైద్యమంతా ఉచితంగా అందించారని అయేషా తల్లి వారికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం అయేషా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె పాకిస్థాన్‌ వెళ్లిపోవచ్చునని డాక్టర్లు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :