మృత్యుంజయుడుగా రానున్న శ్రీవిష్ణు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు. గతేడాది సామజవరగమనతో మంచి హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఈ ఏడాది ఓం భీమ్ బుష్ మూవీతో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ స్వాగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది కాకుండా గీతా ఆర్ట్స్ లో కూడా శ్రీవిష్ణు సినిమా చేస్తున్నాడు.
డైరెక్టర్ బాబీ నిర్మాతగా శ్రీవిష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కోన వెంకట్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. శ్రీవిష్ణు కెరీర్ లో 17వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 85% పూర్తైనట్లు తెలుస్తోంది.
రెబ్బా మౌనిక జాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మృత్యుంజయుడు అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ ను బట్టి చూస్తుంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. థ్రిల్లర్ జానర్ కాబట్టి సినిమా సీరియస్ గాను ఉండే అవకాశముంది. అతి త్వరలోనే సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శ్రీవిష్ణు సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ నటుడిగా కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.