ASBL NSL Infratech

'డబుల్ ఇస్మార్ట్' షూట్‌ను ముంబై లో తిరిగి ప్రారంభించారు

'డబుల్ ఇస్మార్ట్' షూట్‌ను ముంబై లో తిరిగి ప్రారంభించారు

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని వారి బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్' షూట్‌ను తిరిగి ప్రారంభించారు. 2024లో అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ సినిమా షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ లెన్తీ, కీలకమైన షెడ్యూల్‌లో మేకర్స్ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ తాజా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌లో మేజర్ పార్ట్ పూర్తవుతుంది.

పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి సీక్వెల్‌తో టీమ్ రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్ టైన్మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రం కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్ ఇస్మార్ట్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.

టెక్నికల్ గా హై స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

త్వరలోనే హ్యుజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు రాబోతున్నారు మేకర్స్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :