ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై దర్యాప్తు బృందం సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐటీ యాక్ట్ 66 (ఎఫ్)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండులో ఉన్న ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం విచారణ చేపట్టగా పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.