చంద్రబాబు నామినేషన్ కు ముహూర్తం ఖరారు..
ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో క్యాండిడేట్లు నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నామినేషన్ వేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 19 శుక్రవారం నాడున కుప్పంలో చంద్రబాబు నామినేషన్ వేయబోతున్నారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల అధికారికి బాబు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని బుధవారం తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇక ఏప్రిల్ 18 గురువారం నాడు నారా లోకేష్ మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం సీతారాముల ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆ తర్వాత నామినేషన్ సమర్పిస్తారు. మరోపక్క రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరీశ్వరి కూడా 19న నామినేషన్ వేయనున్నారు. గత కొద్ది రోజులుగా జగన్ దాడి తర్వాత ఏర్పడిన ఉధృక్తత కారణంగా నామినేషన్ల విషయంలో ఎలక్షన్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు కట్టుదిట్టమైన బందోబస్తు చేస్తున్నారు.