ఒకప్పటి శత్రువు కోసం ఇప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు..
రాజకీయాలలో చిత్రాలకు కొదవలేదు. ఎన్నడూ ఎరుగని సంఘటనలు కూడా రాజకీయాలలో సునాయాసంగా జరుగుతాయి. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా మాటల యుద్ధాలు చేసిన వారు ఇప్పుడు ఆప్త మిత్రులయ్యారు.. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. టిడిపి అధినేత చంద్రబాబు.. అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్ సభ కూటమి అభ్యర్థి.. బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. గత కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఎంపీగా రాజంపేట నియోజకవర్గం నుంచి బరలోకి దిగుతున్నారు. అయితే ఒకప్పటి తన రాజకీయ ప్రత్యర్థి కోసం ఇప్పుడు చంద్రబాబు ప్రచారం సాగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబుకి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పచ్చి గడ్డి వేసిన భగ్గున మండేది.
రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన చంద్రబాబు.. కిరణ్ కుమార్ రెడ్డి ఒక మంచి నాయకుడని.. అతనిలాంటి అనుభవం ఉన్న పొలిటిషన్ ఇప్పుడు ఎంతో అవసరం అని తెగ మెచ్చుకున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండే వ్యక్తులు ఏదైనా మాట్లాడితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే ఇటువంటి వారి మాటలు రాజకీయాల పైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తగ్గించేస్తున్నాయి. కోడికత్తి డ్రామా, రాళ్ల డ్రామా అని మాట్లాడే నోటి తో ఇలా శత్రువులను పొగడడం చంద్రబాబుకు ఎంతవరకు సమంజసం అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.