ఇప్పుడు వాళ్లు డూప్ ఫైట్ చేస్తున్నారు : లక్ష్మణ్
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టుకుపోతుందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఇప్పుడు వాళ్లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారు. కవితను ఎందుకు అరెస్టు చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడిగారు. బీజేపీ`బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి రెండంకెల స్థానాలు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
Tags :