ASBL NSL Infratech

ప్రశాంతంగా ముగిసిన జగన్ నామినేషన్..

ప్రశాంతంగా ముగిసిన జగన్ నామినేషన్..

ఏపీలో ఈరోజు నామినేషన్లు సమర్పించడానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి సీఎం జగన్ తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు ఆయన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. జగన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా అతని అభిమానులు జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగేలా చేశారు. జనసముద్రంగా మారిన పులివెందల చూస్తే జగన్ కు ఎటువంటి పాపులారిటీ ఉందో అర్థం అవుతుంది. మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌ లో జగన్ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ పులివెందుల తన ప్రాణం లాంటిది అని పేర్కొన్నారు. తనకు తన కుటుంబానికి ఎల్లవేళలా కొండంత అండగా నిలిచే పులివెందుల తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుందని.. అటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ కలను త్వరలో సహకారం చేస్తానని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :