ASBL NSL Infratech

తెలంగాణ లో 17 సీట్ల కోసం పోటీ పడుతున్న 547 మంది..

తెలంగాణ లో 17 సీట్ల కోసం పోటీ పడుతున్న 547 మంది..

తెలంగాణ ఎంపీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 547 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 18 వ తారీఖున ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 25వ తారీఖున ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు.. స్వతంత్ర అభ్యర్థులు, డమ్మీ అభ్యర్థులు అంతా కలుపుకొని 547 మంది తేలారు. రేపు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 19న పోలింగ్ జరగగా ఎన్నికల ఫలితాలు 4 న రానున్నాయి. ఖమ్మం లోక్ సభ స్థానానికి 29 నామినేషన్లు దాఖలు కాగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు స్థానాలకు 120 కి పైగా నామినేషన్లు వచ్చాయి. అయితే ఇందులో కొంతమంది అభ్యర్థులు రెండు లేక మూడు సెట్ల నామినేషన్లు వేసినట్లు టాక్. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు కూడా జరుగుతుండడంతో అక్కడ నుంచి 13 నామినేషన్లో వచ్చాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :